Header Banner

కువైట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ.. కాపాడాలంటూ లోకేశ్ కు కన్నీటి వేడుకోలు!

  Sat Jun 14, 2025 20:24        Politics

ఉపాధి కోసం ఎంతో ఆశతో సముద్రాలు దాటి వెళ్లిన ఓ తెలుగు మహిళ కువైట్‌లో నరకయాతన అనుభవిస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ, ఏజెంట్ మాటలు నమ్మి కువైట్ వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురవుతున్నానని, తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని కన్నీటిపర్యంతమవుతూ వేడుకుంటున్నారు. మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని తనను ఆదుకోవాలని ఆమె ఓ వీడియో ద్వారా అభ్యర్థించారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గేరంపల్లి గ్రామానికి చెందిన పుష్ప అనే మహిళ తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నారు. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె, ఇద్దరు పిల్లల పోషణ కోసం, వారి చదువుల కోసం ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీలేరుకు చెందిన సురేష్ అలియాస్ స్వరాజ్ అనే ఏజెంట్ ద్వారా ఆమె కువైట్‌లోని సాద్ అబ్దుల్లా, జహ్రా ప్రాంతానికి మే 27న చేరుకున్నారు. అయితే, అక్కడకు వెళ్లాక ఏజెంట్ చెప్పిన మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని ఆమె వాపోయారు. ఒక పని అని చెప్పి మరో పని చేయిస్తున్నారని, యజమానులు సరిగ్గా ఆహారం కూడా పెట్టకుండా తీవ్రంగా హింసిస్తున్నారని పుష్ప ఆరోపించారు.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబు సీఎం కావాలని మొక్కు.. మోకాళ్లపై తిరుమలకు తెదేపా నేత! ఆయనకు శుభాకాంక్షలు..

 

"నన్ను కొడుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. తిండి కూడా సరిగా పెట్టడం లేదు. నేను ఇక్కడ ఉండలేను, దయచేసి నన్ను ఇండియాకు తీసుకురావడానికి సహాయం చేయండి" అంటూ ఆమె సుమన్ టీవీకి పంపిన వీడియోలో కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం తాను యజమానులకు తెలియకుండా బాత్రూంలో దాక్కొని మాట్లాడుతున్నానని, బయట తలుపులు కొడుతున్నారని భయాందోళన వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి కోసమే తాను ఇక్కడికి వచ్చానని, కానీ ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపారు. "ఇక్కడ ఆరుగురు పిల్లలు, ఒక ఏడాది బిడ్డ, మొత్తం ఎనిమిది మంది పెద్దవాళ్లు ఉన్నారు. అందరి పనీ నేనే చేయాలి. వాళ్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నాను" అని ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. తాను ఇండియాకు వెళ్లిపోతానంటే, రెండు వేల కువైటీ దినార్లు కడితేనే పంపిస్తామని యజమానులు బెదిరిస్తున్నారని, తన వద్ద అంత డబ్బు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నెల జీతం 110 దినార్లు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు ఒక నెల జీతం మాత్రమే అడిగి అడిగి తీసుకున్నానని ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు వంబాల కృష్ణయ్య, పార్వతి గేరంపల్లిలో ఉన్నారని, పిల్లల భవిష్యత్తు కోసమే తాను ఈ కష్టాలు పడుతున్నానని చెప్పారు. ఏజెంట్ సురేష్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, అతను కూడా సరిగా స్పందించడం లేదని, తిడుతున్నాడని ఆమె ఆరోపించారు. తనను ఎలాగైనా ఈ నరకం నుంచి బయటపడేసి, ఇండియాకు సురక్షితంగా తీసుకురావాలని మంత్రి నారా లోకేశ్ ను, ఏపీ ప్రభుత్వాన్ని పుష్ప వేడుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తున్నాయని, కానీ పిల్లల కోసమే ధైర్యం తెచ్చుకుంటున్నానని ఆమె ఆవేదనతో తెలిపారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విజయ్ మాల్యా: అసలు సరే వడ్డీ, జరిమానాలు ఎవరు కడతారు? ఎవరైనా క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేక చేతులెత్తేస్తే!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్‌ హెచ్చరిక!

 

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

 

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Nara Lokesh #Annamayya district #Kuwait #Pushpa #Telugu woman #domestic violence #labor exploitation #Indian #Embassy #Kuveit #labor laws #AP Government